తిరుపతిలో ఇద్దరు యువకుల మృతదేహాలు కారులో కనిపించాయి. తిరుచానూరు రంగనాథం వీధిలో ఓ కారులో ఇద్దరు యువకుల మృతదేహాలు కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో కారులోనే నిద్రపోయిన ఇద్దరు యువకులు అందులోనే చనిపోయినట్లు తెలుస్తోంది. కారులో పెట్రోల్ లేకపోవడంతో పాటు ఇంజన్ ఆగిపోయిన కారణంగా ఊపరి ఆడకపోవడంతో ఆ ఇద్దరు చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతులు బుచ్చినాయుడు కండ్రిగ, గోవిందప్ప కండ్రిగ గ్రామాలకు చెందిన తిరుణం దిలీప్, పిళ్ళారి వినాయకగా గుర్తించారు. ఈ ఇద్దరి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.