గూగుల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి రూపాయలు విరాళంగా అందించారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు.
ఇక తిరుమలలో ప్రైవేటు సంస్థలు నిర్వహించే హోటళ్ల అద్దెలను భారీగా తగ్గిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. నెలకు రూ.12.99 లక్షలుగా ఉన్న సప్తగిరి హోటళ్ల అద్దెను రూ.9.75 లక్షలకు తగ్గించగా,కౌస్తుభం హోటల్ అద్దె రూ.16.20 లక్షల నుంచి 12.15 లక్షలకు తగ్గించారు. ఎంఎంటీ క్యాంటీన్కు రూ.5.05 లక్షల అద్దెను రూ.3.80 లక్షలు, పీఏసీ(నార్త్)కు రూ.4.10 లక్షలను రూ.3.10 లక్షలకు, హెచ్వీసీకు రూ.3.33 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు పీఏసీ(వె్స్ట)కు రూ.4.44 లక్షల నుంచి రూ.3.35 లక్షలకు, ఎస్ఎంసీ క్యాంటీన్కు రూ.3.88 లక్షల నుంచి రూ.2.95 లక్షలకు తగ్గించారు. కొత్తగా ఐదు చిన్న హోటళ్లు, ఐదు పెద్ద హోటళ్ల నిర్వహణకు టెండర్లు పిలిచింది. టెండరుదారు తప్పనిసరిగా హిందువై ఉండాలని, పది హోటళ్లను నడుపుతూ ఉండాలని, ఈ రంగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలని నిబంధనలు విధించింది.