రేపటి నుంచి తిరుపతిలో మూడు రోజులు సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేత

తిరుమలలో ఈ నెల 25న రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని మూడురోజుల పాటు సర్వదర్శన టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయనుంది

By -  Medi Samrat
Published on : 22 Jan 2026 12:20 PM IST

రేపటి నుంచి తిరుపతిలో మూడు రోజులు సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేత

తిరుమలలో ఈ నెల 25న రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని మూడురోజుల పాటు సర్వదర్శన టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయనుంది. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో మరుసటి రోజు దర్శనాలకు జారీ చేసే ఈ టోకెన్లను ఈ నెల 23, 24, 25 తేదీల్లో జారీ చేయరు. ఈ నెల 23వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకెన్లు గురువారం జారీ చేయనున్నారు. తిరిగి 26వ తేదీన మరుసటి రోజు దర్శనానికి సంబంధించిన టోకెన్లను ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.

Next Story