ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తాం : సీఎం జగన్‌

CM YS Jagan Participated Virtually National Labor Conference. తిరుపతిలో జరిగిన కార్మికశాఖ మంత్రుల జాతీయ సదస్సును ఉద్దేశించి

By Medi Samrat  Published on  26 Aug 2022 12:01 PM GMT
ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తాం : సీఎం జగన్‌

తిరుపతిలో జరిగిన కార్మికశాఖ మంత్రుల జాతీయ సదస్సును ఉద్దేశించి సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ వర్చువల్‌ విధానంలో మాట్లాడారు. పారిశ్రామికవేత్తలకు, కార్మికులకు మేలు చేసేలా కార్మిక చట్టాల రూపకల్పన, బలోపేతంలో ఈ సదస్సు ద్వారా చేసిన మేధోమధనం ఉపయోగపడుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సుకు హాజరైన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు సీఎం. తిరుపతిలో జరుగుతున్న ఈ సదస్సుకి ముఖ్యులంతా రావడం సంతోషకరం అని అన్నారు. ఒక జాతీయ సదస్సుకి తిరుపతిని వేదికగా చేసిన కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని.. ఈ సదస్సుకి వచ్చిన అందరికీ తిరుమల బాలాజీ దీవెనలు ఉంటాయని భావిస్తున్నాన‌ని అన్నారు. గడిచిన రెండు రోజులుగా ఈ సదస్సులో చర్చించిన అంశాలు కార్మిక చట్టాల పటిష్టతకు మరింతగా ఉపయోగపడతాయని అన్నారు. పారిశ్రామికవేత్తలకు, కార్మికులకు మేలు చేసేలా కార్మిక చట్టాల రూపకల్పన, బలోపేతంలో ఈ సదస్సు ద్వారా చేసిన మేధోమధనం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఏపీలో ఈ సదస్సు జరగడం ఆనందదాయకం.. అంతేకాక ఇది గౌరవంగా భావిస్తున్నాం.. అందరికీ బెస్ట్‌ విషెష్‌.. అంటూ సీఎం తన ప్రసంగం ముగించారు.


Next Story