టీటీడీ ఉద్యోగులకు 2వేల హెల్మెట్లు పంపిణీ

టీటీడీ ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి హెల్మెట్లు పంపిణీ చేశారు

By Medi Samrat
Published on : 26 Jun 2025 7:15 PM IST

టీటీడీ ఉద్యోగులకు 2వేల హెల్మెట్లు పంపిణీ

టీటీడీ ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి హెల్మెట్లు పంపిణీ చేశారు. టీటీడీ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని హెల్మెట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఇటీవలే 500 హెల్మెట్లు పంపిణీ చేశామని, అమాలాపురానికి చెందిన నిమ్మకాయల సత్యనారాయణ, హైదరాబాద్ కు చెందిన నాగేంద్ర ప్రసాద్ అనే దాతలు విరాళంగా ఇచ్చిన 2 వేల హెల్మెట్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో మరో 7500 హెల్మెట్లు టీటీడీ ఉద్యోగులకు అందిస్తామని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్లు ధరించాలని టీటీడీ చైర్మన్ కోరారు.

టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులకు అందిస్తున్న హెల్మెట్లు ధరించి ప్రయాణం చేయడం వల్ల ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. హెల్మెట్లు ధరించడంపై అలిపిరి, ఘాట్ రోడ్ల వద్ద ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నామని తెలిపారు. సురక్షిత ప్రయాణం కోసం తిరుమలకు వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని కోరారు.

Next Story