అమెరికాలో కాల్పులు.. తెలంగాణ యువతి దుర్మరణం

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో కాల్పుల కలకలం రేగింది. శనివారం నాడు అలెన్‌ పట్టణంలోని ఓ షాపింగ్‌ మాల్‌లో దుండగుడు

By అంజి  Published on  8 May 2023 5:00 AM GMT
Young woman, Telangana,gunfire,America

అమెరికాలో కాల్పులు.. తెలంగాణ యువతి దుర్మరణం

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో కాల్పుల కలకలం రేగింది. శనివారం నాడు అలెన్‌ పట్టణంలోని ఓ షాపింగ్‌ మాల్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో తెలంగాణ యువతి దుర్మరణం చెందింది. సరూర్‌నగర్‌కు చెందిన తాటికొండ ఐశ్యర్యరెడ్డి (27) దుండగుడి తుపాకీ కాల్పులకు బలైంది. కూతురి మరణ వార్తతో నర్సిరెడ్డి, అరుణ దంపతుల కుటుంబం శోకసంద్రంలోకి వెళ్లింది. అమెరికాలో స్థిరపడ్డ తమ కుమార్తె అకాల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

డల్లాస్‌కు ఉత్తరాన ఉన్న షాపింగ్ మాల్‌లో శనివారం ఓ సాయుధుడు చిన్నారులతో సహా ఎనిమిది మందిని కాల్చి చంపాడు. ఒక వ్యక్తి బాటసారులపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు వివరించడంతో అలెన్ ప్రీమియం అవుట్‌లెట్స్ మాల్ నుండి వందలాది మందిని ఖాళీ చేయించారు. సంబంధం లేని కాల్‌పై పోలీసు అధికారి కాల్పులు విన్న తర్వాత సాయుధుడిని చంపాడు. అతడిని పోలీసులు ఇంకా గుర్తించాల్సి ఉంది. ఈ విషాదం నేపథ్యంలో తుపాకీ నియంత్రణను కఠినతరం చేయాలని అధ్యక్షుడు జో బిడెన్ ఆదివారం మరోసారి కాంగ్రెస్‌కు పిలుపునిచ్చారు.

Next Story