హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ క్వారీ యజమానిని బెదిరించారన్న ఆరోపణలపై ఈ అరెస్ట్ జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్టులో వరంగల్ సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్కు తరలించారు. కౌశిక్ రెడ్డిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం.
ముఖ్యంగా సెక్షన్ 308(2), 308 (4),352 కింద పాడి కౌశిక్ రెడ్డిపై పలు అభియోగాలు మోపినట్టు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ అరెస్ట్పై బీఆర్ఎస్ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. ప్రభుత్వం కుట్రలు - అక్రమ కేసులు ఎన్ని పెట్టినా నిజాయితీ తలవంచదని బీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు. కౌశిక్ రెడ్డిని శంషాబాద్లో అరెస్ట్ చేసిన తీరు ప్రజాస్వామ్యంపై దాడికి సమానం అని అంటున్నారు.