బండి సంజయ్-కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్

War Words Between KTR And Bandi Sanjay. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ సాగుతోంది.

By M.S.R  Published on  22 March 2023 3:00 PM GMT
బండి సంజయ్-కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్

War Words Between KTR And Bandi Sanjay


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ సాగుతోంది. కేటీఆర్ కేంద్రంపై విమ‌ర్శ‌లు చేయ‌గా.. అందుకు బీజేపీ ఛీప్ బండి సంజ‌య్ సెటైరిక‌ల్‌గా స్పందించారు.


'ఆదాయం: అదానీకి..

వ్యయం: జనానికి, బ్యాంకులకు.

అవమానం: నెహ్రూకి..

రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి!!.

బస్, బభ్రాజీమానం భజగోవిందం. దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!' అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఆయన ట్వీట్ చేసిన కాసేపటికే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కౌంటర్ గా ట్వీట్ చేశారు.

'ఆదాయం: కల్వకుంట్ల కుటుంబానికి..

వ్యయం: తెలంగాణ రాష్ట్రానికి.

అవమానం: ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు.

రాజపూజ్యం: ఉద్యమ ద్రోహులకు, దొంగలకు!!

తుస్.. పిట్టల దొర, తుపాకి చంద్రుల గడీల పంచాయితీ లెక్క తేలుడే తరువాయి.. పతనం ఇగ షురువాయే' అని బండి సంజయ్ ట్వీట్ చేశారు.



Next Story