అంతర్జాతీయ పెట్టుబడి నిర్వహణ సంస్థ అయిన వాన్గార్డ్ సోమవారం భారతదేశంలో తన మొట్టమొదటి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC)ని హైదరాబాద్లో స్థాపించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇవాళ వాన్ గార్డు కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆ సంస్థ సీఈవో సలీమ్ రామ్ జీ, సీఐఓ ఐటీ విభాగం ఎండీ నితన్ టాండన్, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ జాన్ కౌచర్, జీసీసీ-వాన్ గార్డు ఇండియా ప్రిన్సిపాల్ హెడ్ వెంకటేశ్ నటరాజన్, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెట్టుబడుల అంశంపై చర్చించారు.
దేశంలోనే తొలి కార్యాలయం హైదరాబాద్ లోనే స్థాపించనున్నట్లు వ్యాన్ గార్డు సంస్థ వెల్లడించింది. దీంతో హైదరాబాద్ కార్యాలయంలో 2,300 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఏఐ, డేటా సెంటర్, మొబైల్ ఇంజినీరింగ్ నిపుణులకు అవకాశాలు రానున్నాయి. ఈ ఏడాది చివరలో హైదరాబాద్లో తమ కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభిస్తామని, రాబోయే నాలుగు సంవత్సరాలలో 2,300 మంది సభ్యులను నియమించుకుంటామని వాన్గార్డ్ తెలిపింది. హైదరాబాద్ క్యాంపస్ కోసం AI మరియు మొబైల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలపై వాన్గార్డ్ దృష్టి పెట్టనుంది.