'పోలింగ్ డేట్' చెప్పేసిన ఉత్తమ్

నేను, పద్మావతి ఇద్దరం హుజూర్ నగర్, కోదాడ నియోజక వర్గాల నుంచి దరఖాస్తు చేసుకోవడానికి

By Medi Samrat  Published on  25 Aug 2023 10:57 AM GMT
పోలింగ్ డేట్ చెప్పేసిన ఉత్తమ్

నేను, పద్మావతి ఇద్దరం హుజూర్ నగర్, కోదాడ నియోజక వర్గాల నుంచి దరఖాస్తు చేసుకోవడానికి వచ్చామని మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నా అంచనా ప్రకారం నవంబర్ 30న పోలింగ్ ఉంటుందని అన్నారు. ఉమ్మడి నల్గొండ లో 12 కి 12 సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చేస్తామ‌న్నారు. దేశంలో పర్ క్యాపిటల్ లోన్ లో తెలంగాణ నంబర్ వన్ అని అన్నారు. ఈ రోజు లిక్కర్ తీసుకోవడం లో.. నెంబర్ వన్.. కరప్షన్ లో తెలంగాణ నంబర్ వన్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఒక్కొక్కరి మీద లక్ష ఇరవైవేల రూపాయల అప్పు చేశారని మండిప‌డ్డారు.

అతిపెద్ద సామాజిక వర్గాలు అయిన మాదిగ, ముదిరాజ్ సామాజిక వర్గలకు మంత్రి పదవి లేదు. టిక్కెట్ ల ప్రకటనలో ముదిరాజ్ లు లేరని అన్నారు. అన్నింటిలో కేసిఆర్ వైఫల్యం చెందారని దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్రాన్ని 119 ముక్కలుగా విభజించి.. ఎమ్మెల్యేలు తమ సామ్రాజ్యంగా భావించి అవినీతి చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాండ్, లాండ్, మైన్, వైన్ గా దోచుకున్నారని ఆరోపించారు. దళిత బందు, బీసీ బందు నామమాత్రం పథకాలు అని అన్నారు.

హుజూర్ నగర్ దళిత బందు అర్హుల వద్ద కమిషన్ తీసుకున్నారని ఆరోపించారు. అర్హుల దగ్గర పది లక్షల లో 50శాతం కమీషన్ తీసుకున్నారని మండిప‌డ్డారు. కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా స్పందించలేదని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. యూనిట్ రాకముందే కమీషన్ వసూలు చేశారని ఆరోపించారు. దళిత బందు, డబుల్ బెడ్ రూం ఇళ్లు అన్నింటిలో లంచాలు తీసుకుంటున్నారని మండిప‌డ్డారు. లంచాలు తీసుకోవడంలో అర్హులు ఏ పార్టీ వారు అయినా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ వ్యవస్థ మొత్తం దోపిడి, అక్రమార్జన మీద దృష్టి పెట్టింది తప్ప అభివృద్ధి మీద కాదన్నారు. డిసెంబర్ మొద‌టి వారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. కేసీఆర్ రెండు చోట్ల పోటీ అనేది భయం తోనే అని ప్రజలు అనుకుంటున్నారన్నారు. కమ్యూనిస్టులను కేసీఆర్ మోసం చేస్తాడు అని నాకు ముందే అర్ధం అయ్యిందన్నారు.

Next Story