చర్చల్లేవ్..వచ్చే ఏడాది మార్చికల్లా నక్సలిజం అంతం చేస్తాం: అమిత్ షా

మావోయిస్టులతో చర్చలు జరపాలన్న డిమాండ్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Knakam Karthik
Published on : 29 Jun 2025 5:57 PM IST

Telangana, Nizamabad, Union Minister Amit Shah, Maoists, operation Kagaar

చర్చల్లేవ్..వచ్చే ఏడాది మార్చికల్లా నక్సలిజం అంతం చేస్తాం: అమిత్ షా

మావోయిస్టులతో చర్చలు జరపాలన్న డిమాండ్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నక్సల్స్‌కు ఆశ్రయం ఇవ్వవచ్చు.. మావోయిస్టులు 40 వేల మంది గిరిజనులను చంపారు. కాంగ్రెస్ చర్చలు జరపాలని కోరుకుంటుంది.

కానీ మా విధానం స్పష్టంగా ఉంది. మావోయిస్టులతో చర్చలు ఉండవు. 2026 మార్చి 30 లోపు లొంగిపోండి లేదా దేశంలో నక్సలిజం లేకుండా చేస్తాం. నక్సలైట్లు తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలి. నక్సలైట్లు త్వరగా జనజీవన స్రవంతిలోకి రావాలి. ఇప్పటికే 10వేల మంది నక్సలైట్లు లొంగిపోయారు.. జన జీవన స్రవంతిలోకి వచ్చేశారు...అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

Next Story