టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పరీక్ష పేపర్ లీక్ కేసును విచారిస్తున్న తెలంగాణ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు

By అంజి  Published on  5 May 2023 6:30 AM GMT
TSPSC ,paper leak case, SIT, ED, Telangana

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పరీక్ష పేపర్ లీక్ కేసును విచారిస్తున్న తెలంగాణ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. వికారాబాద్‌ మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్‌, అతని సోదరుడు రవికుమార్‌లను సిట్‌ అరెస్టు చేసింది. నిందితుల్లో ఒకరైన ధాక్యా నాయక్‌ నుంచి అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) పరీక్ష ప్రశ్నపత్రాన్ని భగవంత్‌ తన సోదరుడు రవికుమార్‌ కోసం కొనుగోలు చేసినట్లు అధికారులు విచారణలో గుర్తించారు.

ప్రశ్నపత్రం కోసం భగవంత్‌.. ధాక్యా నాయక్ ఖాతాలో రూ.2 లక్షలు బదిలీ చేశాడు. మరో ఇద్దరు నిందితుల అరెస్టుతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 21కి చేరింది. ప్రధాన నిందితుడు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్‌కుమార్‌ నుంచి ప్రశ్నపత్రాలు పొందిన టీచర్‌ రేణుక భర్త ధాక్యా. ఏఈ పరీక్షకు హాజరైన తన సోదరుడు రాజేశ్వర్ నాయక్ కోసం ఆమె ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసింది. ఆమె, ధాక్యాతో కలిసి ప్రశ్నపత్రాలను ఇతరులకు విక్రయించింది.

టీఎస్‌పీఎస్సీ స్కామ్ మార్చి 12 న వెలుగులోకి వచ్చింది. దీని కారణంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఏఈఈ, డీఏవో పరీక్షలను రద్దు అయ్యాయి. టీఎస్‌పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేసిన ప్రవీణ్, టీఎస్‌పీఎస్సీలో నెట్‌వర్క్ అడ్మిన్ రాజశేఖర్ రెడ్డి కమిషన్‌లోని రహస్య విభాగంలోని కంప్యూటర్‌లో కొన్ని పరీక్షల ప్రశ్నపత్రాలను దొంగిలించి ఇతర నిందితులకు విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి.

తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగుల లీక్‌కు బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో పరీక్ష పేపర్ లీక్ కేసు తెలంగాణలో సంచలనం సృష్టించింది. టీఎస్‌పీఎస్‌ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రాంచంద్రన్‌, సభ్యుడు బి. లింగారెడ్డిలను కూడా సిట్‌ విచారించింది. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా విచారణ జరుపుతోంది. ఈ కేసులో రూ.33.4 లక్షల ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సిట్‌ గుర్తించింది.

Next Story