నిజామాబాద్ రైతుల 40 ఏళ్ల కలను మోదీ నెరవేర్చారు: అమిత్ షా

నిజామాబాద్‌లో పసుపు రైతుల నలభై సంవత్సరాల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని కేంద్ర హోంశాఖ అమిత్ షా పేర్కొన్నారు.

By Knakam Karthik
Published on : 29 Jun 2025 3:49 PM IST

Telangana, Nizamabad, Turmeric Board office, Amit Shah, Pm Modi

నిజామాబాద్ రైతుల 40 ఏళ్ల కలను మోదీ నెరవేర్చారు: అమిత్ షా

నిజామాబాద్‌లో పసుపు రైతుల నలభై సంవత్సరాల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని కేంద్ర హోంశాఖ అమిత్ షా పేర్కొన్నారు. నిజామాబాద్‌లోని వినాయక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. పసుపు పంటకు నిజామాబాద్‌ రాజధానిలాంటిదని చెప్పారు. నా చేతుల మీదుగా పసుపుబోర్డును ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నా. తెలంగాణకు పసుపు బోర్డు కోసం బీజేపీ ఎంపీలు ఎంతో పోరాడారు. దీంతో తెలంగాణకు పసుపుబోర్డు ఇవ్వడమే కాదు.. దానికి ఛైర్మన్‌గా తెలంగాణ వ్యక్తినే నియమించాం..అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

నిజామాబాద్‌ పసుపు పంటకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. పసుపు ఒక దివ్య ఔషధం. యాంటీ వైరల్‌, యాటీ బ్యాక్టీరియా, యాంటీ క్యాన్సర్‌గా పనిచేస్తుంది. 2030 నాటికి ఒక బిలియన్‌ డాలర్‌ విలువైన పసుపును మనం ఎగుమతి చేయాలి. ఈ బోర్డు ద్వారా రైతులకు నూతన సాగు పద్ధతులపై శిక్షణ కల్పిస్తాం. భారత్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ ద్వారా రైతులకు మేలు చేయాలని కృషి చేస్తున్నాం’’అని కేంద్రమంత్రి అమిత్‌షా తెలిపారు.

Next Story