కాంగ్రెస్‌లోకి భారీగా చేరిక‌లు

TRS leaders joins Congress Party. మునుగోడు, ఇబ్రహీంపట్నం నియోజ‌క‌వ‌ర్గాల‌లో ప‌లు పార్టీల‌కు చెందిన కార్య‌క‌ర్త‌లు

By Medi Samrat  Published on  18 Sep 2022 10:18 AM GMT
కాంగ్రెస్‌లోకి భారీగా చేరిక‌లు

మునుగోడు, ఇబ్రహీంపట్నం నియోజ‌క‌వ‌ర్గాల‌లో ప‌లు పార్టీల‌కు చెందిన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరారు. టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం పార్టీల‌కు చెందిన దాదాపు 300 మంది యువత కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పుడు సర్పంచులు, ఎంపీటీసీలకు ఎంతో గౌరవం ఉండేది.. టీఆర్ఎస్, బీజేపీ అధికారంలోకి వచ్చాక స్థానిక నాయకులంటే పైరవీకారులన్న ముద్ర పడిందని అన్నారు.

ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఎన్నికల కోసం రోజుకో పంచాయితీ తీసుకొస్తున్నాయని విమ‌ర్శించారు. రాష్ట్రంలో పేదలు బతకలేని పరిస్థితి నెలకొంద‌ని విచారం వ్య‌క్తం చేశారు. మునుగోడులో కాంగ్రెస్ గెలుపుకు యువత కృషి చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.


Next Story