విఫలమైన గుజరాత్ మోడల్ కాదు.. విజయవంతమైన తెలంగాణ మోడల్ కావాలి

TRS district presidents urge CM KCR to take a plunge into national politics. తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో జాతీయ రాజకీయాల్లోకి వస్తారంటూ వస్తున్న

By Medi Samrat  Published on  9 Sep 2022 10:44 AM GMT
విఫలమైన గుజరాత్ మోడల్ కాదు.. విజయవంతమైన తెలంగాణ మోడల్ కావాలి

తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రంలోని బీజేపీ ప్రజావ్యతిరేక పాలన నుంచి జాతికి విముక్తి కల్పించేందుకు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) జిల్లా అధ్యక్షులు శుక్రవారం ఆయనను కోరారు. ఆయనతో కలిసి పోరాటంలో పాల్గొంటామని ప్రతిజ్ఞ చేశారు.

తెలంగాణ‌ 33 జిల్లాల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుల్లో 21 మంది శుక్రవారం తెలంగాణ భవన్‌లో సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కేసీఆర్ చేస్తున్న ప్ర‌య‌త్నానికి తమ మద్దతును వారు ఏకగ్రీవంగా ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని, విభజన, మతతత్వ రాజకీయాలతో దేశాన్ని నాశనం చేస్తున్న దుష్టశక్తులను ఓడించాలని ముఖ్యమంత్రిని కోరారు. విఫలమైన గుజరాత్ మోడల్ కాదు దేశానికి విజయవంతమైన తెలంగాణ మోడల్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని గుర్తు చేశారు.

"కేసీఆర్ ఆగే బడో, హమ్ తుమ్హారే సాథ్ హై, (కేసీఆర్ దయచేసి ముందుకు సాగండి, మేము మీతో ఉన్నాము). జాతీయ స్థాయిలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ మోడల్‌ను చంద్రశేఖర్‌రావు ప్రతిరూపిస్తారని ఈ దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. బిజెపి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. అంతేకాకుండా, బిజెపి అన్ని రాజ్యాంగ సంస్థలు, వ్యవస్థలను కూడా నాశనం చేసిందని ఆయన అన్నారు.

బీజేపీ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు చంద్రశేఖర్‌రావు జాతీయ పార్టీని స్థాపించాల్సిన అవసరం ఉందని నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఉద్ఘాటించారు. ''సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి వైపు చూస్తున్నారు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాలని, తన ప్రయత్నాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో చేసినట్లుగా సంపద సృష్టించి పేదలకు పంచాలని వారు కోరుకుంటున్నారు'' అని అన్నారు.

మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ కవిత మాలోత్ మాట్లాడుతూ.. కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులను దేశవ్యాప్తంగా నిర్మించాలని రైతులు కోరుతున్నారు.

''తెలంగాణ ప్రజలే కాదు, భారతదేశ పౌరులందరూ కేసీఆర్ లాంటి ఆదర్శవంతమైన, దృఢ సంకల్పం ఉన్న‌ నాయకుడిని అధికారంలో చూడాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం కొత్త పార్టీ పెట్టేందుకు టీఆర్‌ఎస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది'' అని నల్గొండ జిల్లా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటనను విపక్ష నేతలంతా అభినందిస్తున్నారని అన్నారు.

హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్‌ఎస్ అధ్యక్షుడి నాయకత్వం, ధైర్యం దేశానికి అవసరమన్నారు. సంక్షేమ పథకాలను 'ఉచితాలు'గా పేర్కొంటూ రాష్ట్రాలు వాటిని ఉపసంహరించుకోవాలని కేంద్రం కోరిందని ఆయన మండిపడ్డారు. స్వాతంత్య్ర ఉద్యమం నాటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇలాంటి డిమాండ్‌ చేయలేదని ఆయన అన్నారు.


Next Story