భద్రాచలంలోని గోదావరి నదిలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర విషాదం చోటు చేసుకుంది. గొల్లగూడెం ఇసుక దిబ్బ వద్ద స్నానం చేయడానికి నదిలోకి దిగిన ఏడుగురు యువకులలో ఐదుగురు నీటిలో మునిగిపోయారు. మిగిలిన ఇద్దరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకుని సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గల్లంతైన వారి కోసం నిపుణులైన ఈతగాళ్లతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.