బనకచర్లను అడ్డుకోవడమే మా టార్గెట్: టీపీసీసీ చీఫ్
బనకచర్లను అడ్డుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం..అని టీపీసీసీ మహేశ్ కుమార్ అన్నారు
By Knakam Karthik
బనకచర్లను అడ్డుకోవడమే మా టార్గెట్: టీపీసీసీ చీఫ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ పెంచి ఎన్నికలకు వెళ్లాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ గాంధీభవన్లో మహేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలపై కార్యవర్గ సమావేశంలో చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర పాలన గోల్డెన్ పీరియడ్. పార్టీ నిర్మాణంపై మంగళవారం కీలక సమావేశాలు జరిగాయి. బీసీలకు మంత్రి వర్గంలో చోటు ఇచ్చే అవసరం ఉంది. మా ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. జూలై 4వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో జరిగే కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు..అని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఆస్తుల కోసమే కుమ్ములాట..
కల్వకుంట్ల ఫ్యామిలీలో ఆస్తుల కోసం అంతర్గత కుమ్ములాట జరుగుతుంది..అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మహిళల గురించి కవిత మాట్లాడటం సిగ్గుచేటు. ఆనాడు కేబినెట్లో అవకాశం ఇవ్వనప్పుడు ఎందుకు మాట్లాడలేదు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒరుగపెట్టింది ఏంటంటే.. రాజ్యాంగ వ్యతిరేకంగా విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేశారు. సినీ తారల ఫోన్ ట్యాపింగ్ చేసి వారి దాంపత్య జీవితాల్లో తగాదాలు ఎంతో దూరం పోయిందో అందరికీ తెలుసు. జడ్జిల మాట వినని బ్యూరోక్రట్స్, ఆఖరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేశారు. మీ పదేళ్ల పాలన, మా 18 నెలల పాలనపై చర్చలకు సిద్ధం అన్నారు.. కానీ ఎవరూ ముందుకు రావడం లేదు..అని మహేశ్ కుమార్ విమర్శించారు.
బనకచర్లను అడ్డుకోవడమే మా టార్గెట్:
బనకచర్లను అడ్డుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం..అని టీపీసీసీ మహేశ్ కుమార్ అన్నారు. బనకచర్ల పాపం కేసీఆర్ది మాత్రమే. చేపల పులుసు, బిర్యానీ తిని వచ్చింది కేసీఆర్. కృష్ణ నీటిపై సంతకం చేసింది హరీష్ రావు కాదా? పొతిరెడ్డిపాడుకు అదనంగా అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదా? కాళేశ్వరం కట్టి ప్రజల సొమ్ము మింగింది మీరు కాదా..అని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.