క్యాన్సర్ బాధితురాలికి జగ్గారెడ్డి రూ. 10 లక్షల సాయం

క్యాన్సర్ బాధితురాలికి టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అండ‌గా నిలిచారు.

By Medi Samrat
Published on : 22 April 2025 4:57 PM IST

క్యాన్సర్ బాధితురాలికి జగ్గారెడ్డి రూ. 10 లక్షల సాయం

క్యాన్సర్ బాధితురాలికి టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అండ‌గా నిలిచారు. రూ. 10లక్షల నగదు సాయం అందించి భ‌రోసా క‌ల్పించారు. సదాశివపేటకు చెందిన ఆమని అనే మహిళ ఇంటికి వెళ్లిన జగ్గారెడ్డి ఆమెను పరామర్శించారు. చికిత్స కోసం ఇప్పటి వరకు రూ. 7లక్షల అప్పులు చేశానని.. భర్త చనిపోయాడని, ఇద్దరు ఆడపిల్లలతో దయనీయ జీవితం గడుపుతున్నానని ఆమని విలపించింది. ఈ నరకం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, పిల్లల కోసం బతుకుతున్నానని వాపోయింది. బాధితురాలి గాథ విని తక్షణమే రూ. 10లక్షలు అందించారు జగ్గారెడ్డి.

సీఎం రేవంత్ రెడ్డి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించాలని తీసుకున్న నిర్ణయం మంచిదని జగ్గారెడ్డి అన్నారు. తనకు సాయం చేసి, వీడియోలు, ఫోటోలు తీయించుకునే అలవాటు లేదన్నారు. కానీ ఈ సమస్య పది మంది దృష్టికి రావాలని మీడియా దృష్టికి తీసుకు వచ్చా నన్నారు. పేదలకు ఇలాంటి రోగాలు వస్తే.. కనీసం చికిత్స చేయించుకోవడానికి.. పైసలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి నిరుపేద క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు దాతలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. క్యాన్సర్ బాధితులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులు.. ట్రీట్ మెంట్ కోసం నిరుపేద క్యాన్సర్ బాధితులు పడుతున్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళతాన‌న్నారు.

Next Story