ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలి: ఎమ్మెల్సీ కవిత

భద్రాచలం పట్టణంలో ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

By Knakam Karthik
Published on : 25 Jun 2025 11:29 AM IST

Telangana, Mlc Kavitha, Pm Modi, Pragati Agenda, Bhadrachalm

ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలి: ఎమ్మెల్సీ కవిత

భద్రాచలం పట్టణంలో ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కవిత ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో ‘ప్రగతి ఎజెండా’ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించబడిన ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ప్రాంతానికి చెందిన ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తమపట్నం, గుండాల గ్రామాల గురించి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని నాయకులను కోరుతున్నానని అన్నారు.

ఆ ఐదు గ్రామాలకు న్యాయం జరగాలని తాను డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. భౌగోళికంగా ఐదు గ్రామాలు తెలంగాణలో ఉన్నా అన్యాయంగా, అక్రమంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారని ఆక్షేపించారు. ఆ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూసైనా వారిపై సానుభూతి చూపి, ఆ ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలి. ఈ ఐదు గ్రామ పంచాయతీలు పోలవరం ముంపు జాబితాలో, ప్యాకేజీ జాబితాలో లేవు..అని ఎమ్మెల్సీ కవిత రాసుకొచ్చారు.

Next Story