గుడ్‌న్యూస్..మెడికల్ స్టూడెంట్స్‌కు స్టైఫండ్ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్రంలో మెడికల్ స్టూడెంట్స్‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

By Knakam Karthik
Published on : 29 Jun 2025 7:15 PM IST

Telangana, Congress Government, Medical Students,

గుడ్‌న్యూస్..మెడికల్ స్టూడెంట్స్‌కు స్టైఫండ్ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్రంలో మెడికల్ స్టూడెంట్స్‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ఇచ్చే స్టైఫండ్‌ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 15% స్టైఫండ్ పెంచుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. మెడికల్, డెంటల్ స్టూడెంట్స్ తోపాటు సీనియర్ రెసిడెంట్స్ కు ఇది వర్తిస్తుందని తెలిపింది. తాజా పెంపుతో ఇంటర్న్‌లకు నెలకు రూ.29,792 స్టైఫండ్ లభించనుంది. పీజీ డాక్టర్లకు ఫస్ట్‌ ఇయర్‌లో రూ.67,032, సెకండ్‌ ఇయర్‌లో రూ.70,757, ఫైనల్‌ ఇయర్‌లో రూ.74,782 గౌరవ వేతనం ఇవ్వనున్నారు.

Next Story