ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ మెడికల్ బిల్లులను మంజూరు చేసింది. రూ.180.30 కోట్ల బకాయిలను విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. దీంతో 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించింది