తెలంగాణలో వాహనదారులకు షాక్..మార్చి 1 నుంచి పెరగనున్న ధరలు

తెలంగాణలో కొత్త వాహనాల కొనుగోలుదారులపై అదనపు భారం పడనుంది

By -  Knakam Karthik
Published on : 26 Feb 2026 10:29 AM IST

Telangana, Road Safety Cess, Vehicle Tax, Telangana Govt, Transport Department, New Vehicle Prices

తెలంగాణలో వాహనదారులకు షాక్..మార్చి 1 నుంచి పెరగనున్న ధరలు

తెలంగాణలో కొత్త వాహనాల కొనుగోలుదారులపై అదనపు భారం పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1వ తేదీ నుండి కొత్త వాహనాలపై 'రహదారి భద్రత పన్ను' (రోడ్ సేఫ్టీ సెస్) వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రవాణా శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మోటారు వాహనాల పన్నుల (సవరణ) చట్టం-2026 ప్రకారం, కార్లు, ప్రయాణికుల ఆటోలు మరియు ఇతర నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ పన్నును చెల్లించాల్సి ఉంటుంది.

వాహన రకాన్ని బట్టి ఈ పన్ను రూ. 2,000 నుండి రూ. 10,000 వరకు ఉంటుంది. ఈ కొత్త నిబంధన ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి సుమారు రూ. 270 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. రహదారి భద్రతను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ఈ సెస్‌ను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మార్చి 1వ తేదీ నుండి షోరూమ్‌లలో కొత్త వాహనాలు కొనేవారు ఈ అదనపు మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి.

Next Story