ఆశా వర్కర్లకు స్మార్ట్ఫోన్ల పంపిణీ
Telangana stands in No 1 place in public health sector in the Country. ప్రజారోగ్య పరిరక్షణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఇంధన శాఖ మంత్రి జగదీశ్రెడ్
By Medi Samrat Published on 20 Feb 2022 8:47 AM GMT
ప్రజారోగ్య పరిరక్షణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఇంధన శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆశా వర్కర్లకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేసిన మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యసేవలు అందించడంలో ఆశా కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కోవిడ్ ఫ్రంట్లైన్ యోధులుగా మహమ్మారి సమయంలో ఆశా కార్యకర్తలు అందించిన సేవలు వారికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల వేతనాలను నెలకు రూ. 9,750కి పెంచింది.
ఇతర రాష్ట్రాల్లోని ఆశా వర్కర్లకు కేవలం రూ.3 వేలు చెల్లిస్తున్నారని.. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ నిరూపించారని మంత్రి అన్నారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో ఆశా వర్కర్లదే ప్రధాన పాత్ర అని అన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల ఆరోగ్య వివరాలను అప్లోడ్ చేయడానికి వీలుగా ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సూర్యాపేట జిల్లాలో 1,070 మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కోటాచలం తదితరులు పాల్గొన్నారు.