తెలంగాణలో రేపటి నుంచే టెన్త్ పరీక్షలు..5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

By -  Knakam Karthik
Published on : 13 March 2026 11:10 AM IST

Telangana, Education News, Telangana SSC, 10th Class Exams

తెలంగాణలో రేపటి నుంచే టెన్త్ పరీక్షలు..5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరం మొత్తం 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా, వారి కోసం విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుందని, కేవలం ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్‌తో ఉదయం 9.35 గంటల వరకు మాత్రమే విద్యార్థులను హాలులోకి అనుమతిస్తామని అధికారులు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఆఖరి నిమిషం రద్దీని మరియు ఒత్తిడిని నివారించడానికి విద్యార్థులు కనీసం అరగంట ముందే, అంటే ఉదయం 9.00 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.

పరీక్షల నిర్వహణ కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన విద్యాశాఖ, మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉండేందుకు సిట్టింగ్ మరియు ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేస్తారని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని, హాల్ టికెట్‌పై ఫోటో సరిగ్గా లేని పక్షంలో ప్రధానోపాధ్యాయుడితో అటెస్టేషన్ చేయించుకోవాలని సూచించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని కేంద్రాలలో తాగునీరు మరియు ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలను సిద్ధం చేశారు. నిమిషం ఆలస్యం నిబంధన అమల్లో ఉన్నందున విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

Next Story