Telangana sees a slight decline in COVID-19 positive cases: Harish Rao. రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టిందని.. మహమ్మారి నుంచి
By Medi Samrat Published on 29 Jan 2022 10:18 AM GMT
రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టిందని.. మహమ్మారి నుంచి రాష్ట్రం త్వరగా బయటపడుతుందని ఆరోగ్య మంత్రి టి హరీశ్రావు ఆకాంక్షించారు. ప్రజలు సహకరిస్తే థర్డ్ వేవ్ నుంచి బయటపడతామని అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రూ.34 కోట్లతో నిర్మించనున్న 100 పడకల ఆస్పత్రికి మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సత్తుపల్లిలో ప్రభుత్వం రూ.1.25 కోట్లతో డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటు చేసిందన్నారు. ఖమ్మంలో క్యాథ్లాబ్ ఏర్పాటు చేస్తామని.. కల్లూరు, పెనుబల్లిలో ఆసుపత్రులు నిర్మిస్తామని.. కేసీఆర్ కిట్లతో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు 52 శాతం పెరిగాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి లక్ష్యం సంక్షేమమని మంత్రి చెప్పారు.
ప్రతి జిల్లా కేంద్రంలో డయాలసిస్ సెంటర్లు, ఐసీయూ వార్డులు ఏర్పాటు చేసింది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమేనని హరీశ్రావు అన్నారు. కల్యాణలక్ష్మి పథకం కింద ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించిందని తెలిపారు. రాష్ట్రంలో టీకాలు వేసే కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులందరికీ బూస్టర్ డోస్లు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వర్రావు పాల్గొన్నారు.