అవినీతి ఆరోపణలు.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు మంత్రి పొన్నం నోటీసులు

హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డితో పాటు మరో ఏడుగురికి తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ లీగల్‌ నోటీసులు పంపారు.

By అంజి  Published on  23 Jun 2024 11:04 AM GMT
Telangana, Ponnam Prabhakar, BRS MLA, MLA Kaushik Reddy

అవినీతి ఆరోపణలు.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు మంత్రి పొన్నం నోటీసులు

హైదరాబాద్‌: నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) రామగుండంలో ఫ్లై యాష్‌ కుంభకోణంలో రూ. 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ చేసిన ఆరోపణలకు సంబంధించి హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డితో పాటు మరో ఏడుగురికి తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ లీగల్‌ నోటీసులు పంపారు. ఈ అంశంపై కౌశిక్ రెడ్డితో పాటు టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్, నమస్తే తెలంగాణ ఎడిటర్ తీగుళ్ల కృష్ణమూర్తి, తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్, తెలంగాణ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు పరువు నష్టం నోటీసును మంత్రి పొన్నం పంపారు.

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎన్‌టీపీసీ రామగుండం నుంచి రోజూ అక్రమంగా ఫ్లై యాష్‌ రవాణా చేస్తూ రూ.50 లక్షలు తీసుకుంటున్నారని ఆరోపించారు. పొన్నం ప్రభాకర్ మేనల్లుడు అనుప్ డబ్బు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. తాను 13 ట్రక్కులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నానని, అయితే రవాణా శాఖ రెండు ట్రక్కులను సీజ్ చేసిందని, మంత్రి ఫోన్ చేసిన తర్వాత మిగిలిన వాటిని విడుదల చేశారని కౌశిక్ ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపణలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.

ఎన్టీపీసీ రామగుండం 2,600 మెగావాట్ల (MW) సూపర్ థర్మల్ పవర్ స్టేషన్. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పవర్ స్టేషన్.దేశంలో మొదటి ISO 14001 సర్టిఫికేట్ పొందిన “సూపర్ థర్మల్ పవర్ స్టేషన్”.

Next Story