ఎన్నికల తర్వాత పెన్షన్ల పెంపు, కొత్త రేషన్ కార్డులు: మంత్రి పొన్నం

ఎన్నికల కోడ్‌ ముగియగానే ఆమోదించిన కొత్త పింఛన్‌లతో సహా పెంచిన రూ.4 వేల పింఛన్‌ను అందజేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు.

By అంజి  Published on  1 May 2024 2:15 PM GMT
Telangana, Ponnam Prabhakar, pension hike, new ration cards, LokSabha polls

ఎన్నికల తర్వాత పెన్షన్ల పెంపు, కొత్త రేషన్ కార్డులు: మంత్రి పొన్నం

హైదరాబాద్‌: ఎన్నికల కోడ్‌ ముగియగానే ఆమోదించిన కొత్త పింఛన్‌లతో సహా పెంచిన రూ.4 వేల పింఛన్‌ను అందజేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. కొత్త దరఖాస్తుదారులకు లోక్‌సభ ఎన్నికల తర్వాత రేషన్‌కార్డులు అందజేస్తామని చెప్పారు. కార్మిక దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో జరిగిన మే డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి.. ఆరు గ్యారంటీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

రాష్ట్రంలోని వృద్ధాప్య పింఛనుదారులు, వితంతువులు, ఒంటరి మహిళలకు నెలకు రూ.2,116 నుంచి రూ.4,000, వికలాంగులకు రూ.3,116 నుంచి రూ.6,000లకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. డిసెంబరు 28 నుండి జనవరి 6 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన “ప్రజా పాలన” ప్రచారంలో మొత్తం 24.84 లక్షల కొత్త దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 44 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేయబడుతున్నాయి.

కొత్త రేషన్‌కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Next Story