Telangana Polls: ట్రాన్స్జెండర్కు టికెట్ కేటాయించిన బీఎస్పీ
బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన అభ్యర్థుల రెండో జాబితాలో 43 మంది పేర్లలో ఒక ట్రాన్స్జెండర్కి టికెట్ కేటాయించింది.
By అంజి Published on 31 Oct 2023 12:06 PM IST
Telangana Polls: ట్రాన్స్జెండర్కు టికెట్ కేటాయించిన బీఎస్పీ
హైదరాబాద్: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన అభ్యర్థుల రెండో జాబితాలో 43 మంది పేర్లలో ఒక ట్రాన్స్జెండర్కి టికెట్ కేటాయించింది. వరంగల్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా చిత్రపు పుష్పితా లయ (29) బరిలో నిలిచారు. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి ట్రాన్స్జెండర్గా ఆమె నిలవనున్నారు. సోమవారం రెండో జాబితాను విడుదల చేసిన అనంతరం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. ట్రాన్స్జెండర్కు టికెట్ కేటాయించాం, బీసీలకు 20, ఎస్సీలకు 10, ఎస్టీలకు 8, ఓసీలకు మూడు, మైనార్టీలకు రెండు టిక్కెట్లు కేటాయించాం అని చెప్పారు.
వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్ధి చిత్రపు పుష్పితలయ గారికి హార్దిక శుభాకాంక్షలు.@BSP4Telangana @RSPraveenSwaero #TelanganaElection2023 pic.twitter.com/FD8JNFjX2N
— BIT CELL Telangana (@BITCELL_BSP) October 30, 2023
అంతకుముందు అక్టోబర్లో, పార్టీ 20 మంది అభ్యర్థుల పేర్లతో వారి మొదటి జాబితాను విడుదల చేసింది, దాని ప్రకారం ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు. పార్టీ ఇప్పటికే 20 మంది పేర్లతో తొలి జాబితాను విడుదల చేసిందని, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు మద్దతు ఇవ్వవద్దని ప్రవీణ్ కుమార్ ప్రజలను కోరారు. వారు ఓట్ల కోసం తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని ఆరోపించారు.
Here is the second list of BSP warriors (candidates). As promised by @RSPraveenSwaero. BCs have been given proportionate seats alongside SC, ST and Muslim minorities.@BSP4Telangana @AllIndiaBSP @BITCELL_BSP pic.twitter.com/yUxR5NH7H4
— RSP ARMY 🐘🐘 (@RSPARMY) October 30, 2023
బీజేపీ నాయకత్వాన్ని విమర్శించిన ప్రవీణ్.. ''బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తానని అమిత్ షా హామీ ఇచ్చారు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో ఓసీ నాయకుడిని నియమించినందుకు ఇది ఒక జోక్'' అంటూ ఎద్దేవా చేశారు. బీఎస్పీ ఇప్పటివరకు ప్రకటించిన 63 మంది అభ్యర్థుల్లో 26 మంది బీసీలు, 21 మంది ఎస్సీలు, 11 మంది ఎస్టీలు, ముగ్గురు ఓసీలు, ఇద్దరు మైనార్టీలు ఉన్నారు.