ఇరాక్‌లో చిక్కుకున్న జగిత్యాల యువకుడు.. సాయం కోసం సెల్ఫీ వీడియో

జగిత్యాల నియోజక వర్గంలోని సారంగాపూర్ మండలానికి చెందిన అజయ్ అనే యువకుడు ఇరాక్‌లో చిక్కుకుపోయాడు. తనను భారత్‌కు తిరిగి తీసుకు రావాలని సెల్ఫీ వీడియో ద్వారా అధికారులను వేడుకున్నాడు.

By అంజి
Published on : 9 Oct 2024 3:00 AM

Telangana man, Iraq , India, Frauds, Stranded citizens, Telangana

ఇరాక్‌లో చిక్కుకున్న జగిత్యాల యువకుడు.. సాయం కోసం సెల్ఫీ వీడియో

హైదరాబాద్: జగిత్యాల నియోజక వర్గంలోని సారంగాపూర్ మండలానికి చెందిన అజయ్ అనే యువకుడు ఇరాక్‌లో చిక్కుకుపోయాడు. తనను భారత్‌కు తిరిగి తీసుకు రావాలని సెల్ఫీ వీడియో ద్వారా అధికారులను వేడుకున్నాడు. ఈ మేరకు అజయ్ పంపిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏజెంట్ కు సుమారు రూ. 3 లక్షలు చెల్లించి మోసపోయానంటూ రోదిస్తున్నాడు అజయ్. తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్న ఏజెంట్ చేతిలో మోసపోయి, స్వదేశానికి వెళ్లే దారిలేక పరాయి దేశంలో చిక్కుకుపోయి తాను పడుతున్న కష్టాలను అజయ్ వీడియోలో పంచుకున్నారు.

ఒక్కోసారి తినే తిండి దొరక్క తాను పడ్డ కష్టాన్ని, తన కష్టమైన జీవన పరిస్థితులను వివరించాడు అజయ్. మొదట్లో అతను మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం ఇరాక్‌కు వెళ్లినట్లు నివేదించబడింది. అయితే 14 నెలలుగా పనిలేక ఒక్కపూటే తింటున్నానని, స్వదేశానికి రాలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏజెంట్ యొక్క మోసపూరిత చర్యల కారణంగా ఇప్పుడు అతను ఇరాక్‌లో చిక్కుకుపోయాడు. అజయ్ తన ఇంటికి తిరిగి రావడానికి సహాయం కోసం అత్యవసరంగా వీడియోలో విజ్ఞప్తి చేశాడు.

Next Story