తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ సోమవారం రిలీజ్ అయ్యాయి. కాగా ఈ ఫలితాలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులు రిలీజ్ చేశారు. ఈ ఫలితాల్లో 67.4 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. కాగా, ఇంటర్ మొదటి, రెండో ఏడాది జనరల్, వృత్తి విద్యా కోర్సులకు చెందిన విద్యార్థులందరి ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలు, మార్కులు https://tgbie.cgg.gov.in, http://results.cgg.gov.in ఈ వెబ్సైట్లలో చెక్ చేసుకోవచ్చు.
కాగా ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,12,724 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఫస్ట్ ఇయర్ జనరల్లో 2,49,204 మంది, ఒకేషనల్లో 17,003 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక సెకండ్ ఇయర్ జనరల్లో 1,34,988 మంది, ఒకేషనల్లో 12,402 మంది విద్యార్థులు ఉన్నారు. మే 22 నుంచి మే 29వ తేదీ వరకు రోజుకు రెండు విడతల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.