వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ గవర్నర్

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు.

By Kalasani Durgapraveen  Published on  18 Oct 2024 11:45 AM GMT
వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ గవర్నర్

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయం సహా వివిధ రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు వైస్-ఛాన్సలర్ పోస్టుల నియామకాలకు ఆమోదం తెలిపారు. ఈ ఏడాది మే నెలలో రాష్ట్రంలో యూనివర్శిటీల వైస్‌ ఛాన్స్‌లర్ల పదవీ కాలం ముగిసింది. దీంతో కొత్త వీసీల నియామకం కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. ఇప్పుడు నియామకాలు జరిపింది. అందుకు సంబంధించిన పత్రికా ప్రకటన విడుదలైంది.

- పాలమూరు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా జీఎన్ శ్రీనివాస్

-వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి

-హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా కుమార్ మొగ్లారం

-కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా ఉమేష్ కుమార్

-హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా నిత్యానందరావు

-నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా అల్తాఫ్ హుస్సేన్

-తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్‌ వైస్‌ ఛాన్సలర్‌గా యాదగిరిరావు

-హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య

- శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా రాజి రెడ్డి

వివిధ యూనివర్సిటీల నియామకాల ప్రక్రియను తమ ప్రభుత్వం వేగవంతం చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టులోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నియామకాలు జరిగాయి.


Next Story