111 జీవోను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం

Telangana govt revokes G.O 111. రాష్ట్ర ప్రభుత్వం జీవో 111ని రద్దు చేయాలని నిర్ణయించింది. మంగళవారం ముఖ్యమంత్రి

By Medi Samrat  Published on  12 April 2022 1:59 PM GMT
111 జీవోను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం జీవో 111ని రద్దు చేయాలని నిర్ణయించింది. మంగళవారం ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల‌ చంద్రశేఖర రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 83 గ్రామాలలో విపరీతమైన పారిశ్రామికీకరణ, భారీ నిర్మాణ కార్యకలాపాలు మ‌రియు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కాలుష్యం నిరోధించడానికి 1996 లో జీవో 111 జారీ చేయబడింది. జీఓ 111ని ప్రభుత్వం త్వరలో రద్దు చేస్తుందని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఓ ప్రశ్నపై కేసీఆర్ స్పందిస్తూ.. ప్రస్తుతం ఆ జీవో అవసరం లేదని అన్నారు. "ఆ సమయంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలను తీర్చిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను రక్షించడానికి జిఓ జారీ చేయబడింది. అయితే ప్రభుత్వం తాగునీటి సమస్యను అధిగమించడంతో జిఓ నిరుపయోగంగా మారిందని సీఎం అన్నారు.

'జీఓ 111 కింద సుమారు 1,32,600 ఎకరాల భూమి ఉందని, ఎమ్మెల్యే యాదయ్య చెప్పినట్లు 83 గ్రామాలు, ఏడు మండలాలు కలిపి ఉన్నాయని, సుంకిశాల, మల్లన్న సాగర్‌ల నుంచి నీళ్లివ్వడం వల్ల హైదరాబాద్‌కు మరో 100 ఏళ్ల వరకు నీటి కష్టాలు ఉండవని సీఎం తెలిపారు. ఒకేసారి జిఓ ఎత్తివేస్తే గ్రామాలు, భూములు నష్టపోతాయని ఆయన అన్నారు. అందుకే దశలవారీగా సమస్యను పరిష్కరించే బాధ్యతను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి, అధికారులకు అప్పగించామని, నిపుణుల కమిటీ కూడా సమస్యను పరిశీలిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు.













Next Story