హైదరాబాద్ ఎర్రగడ్డలోని మెంటల్ కేర్ సెంటర్లో ఫుడ్ పాయిజన్పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హాస్పిటల్లో ఆహార పదార్థాల సరఫరా కాంట్రాక్టర్ జైపాల్రెడ్డిని తొలగిస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఆర్ఎంవో డాక్టర్ పద్మజను సస్పెండ్ చేసింది. కలుషిత ఆహారం ఘటనలో ఒక రోగి మృతి చెందగా, 92 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 18 మందిని మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుట్పాయిజన్ కారణంగా 70 మంది రోగులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇందులో ఒక మానసిక రోగి కిరణ్ ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 68 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆరా తీశారు. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.