ఉపాధి హామీ నిధులు రిలీజ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న సిబ్బందికి నాలుగు నెలల బకాయి వేతనాలు విడుదల చేసింది.

By Knakam Karthik
Published on : 6 May 2025 11:15 AM

Telangana, Congress Government, MGNREGA, Pending Salaries

ఉపాధి హామీ నిధులు రిలీజ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద పని చేస్తున్న సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న వేతనాలు విడుదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల వేతనాలు చెల్లించేందుకు రూ. 62 కోట్లు విడుదల చేసింది. ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న సిబ్బందికి నాలుగు నెలల బకాయి వేతనాలు విడుదల చేసింది.

రాష్ట్రంలో ఈ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీవోలు మొత్తం 3,200 మందికి చెందిన రూ.62 కోట్ల వేతన బకాయిలు మంగళవారం విడుదల అయ్యాయి. అయితే తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తక్షణమే తమ జీతాలు విడుదల చేయాలని గత కొద్ది రోజులుగా వీరంతా నిరసనకు దిగారు. దీనిపై స్పందించిన సర్కార్ నేడు ఆ పెండింగ్ బకాయిలను విడుదల చేసింది.

Next Story