బనకచర్ల ప్రాజెక్టుపై రేపు తెలంగాణ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By Knakam Karthik
Published on : 17 Jun 2025 4:36 PM IST

Telangana, Cm Revanthreddy, banakacherla project, Congress govt, Godavari rivers

బనకచర్ల ప్రాజెక్టుపై రేపు తెలంగాణ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుపై అన్ని పార్టీల లోక్ సభ, రాజ్యసభ సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో రేపు సాయంత్రం 4 గంటలకు నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచర్లపై పీపీటీ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తోపాటు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం లోక్ సభ, రాజ్యసభ సభ్యులకు లేఖలు పంపి స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ప్రతిపాదించిన గోదావరి – బంకచర్ల ప్రాజెక్టుపై ప్రదర్శన, చ‌ర్చించనున్నట్లు, అందులో పాల్గొని అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.

గోదావరి బంకచర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంటూ తాను 22 జనవరి 2025న కేంద్ర ఆర్థిక మరియు జలశక్తి మంత్రులకు లేఖలు రాసిన విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వాన పత్రికతో పాటు వివరించారు. ఈ ప్రాజెక్టు విషయంలో అభ్యంతరాలను తెలుపుతూ జూన్ 3న సీఎం రేవంత్ రెడ్డి, తాను కలిసి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు విషయాన్ని వివరించామన్నారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని తదుపరి చర్యలు తీసుకునేందుకు రేపు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంతక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ ని గౌరవ అథితులుగా ఆహ్వానిస్తు వారి విలువైన సూచనలు కోరుతున్నట్లు ఉత్తమ్ తన ఆహ్వానంలో పేర్కొన్నారు.

Next Story