కేంద్రం సహకారం అందకపోయినా.. తెలంగాణ రాష్ట్రం ఇదే తరహాలో అభివృద్ధి చెందుతుంది
Telangana goes ahead in development even if no support from centre. కేంద్ర బడ్జెట్లో సామాన్యులకు మేలు చేసే అంశాలు ఏమీ లేవని మంత్రి కేటీఆర్ అన్నారు.
By Medi Samrat Published on 2 Feb 2022 1:37 PM GMT
కేంద్ర బడ్జెట్లో సామాన్యులకు మేలు చేసే అంశాలు ఏమీ లేవని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు కేంద్రం మొగ్గు చూపిందని ఆయన అన్నారు. కేంద్రం నుంచి నిధులు లేకపోయినా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హయాంలో తెలంగాణ రాష్ట్రం ఇదే తరహాలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్ నగర్, పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషన్లలో మంత్రి మల్లారెడ్డితో కలిసి కేటీఆర్ బుధవారం పర్యటించి రూ.303 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జవహర్నగర్లోని చిన్నాపురం చెరువు సుందరీకరణకు సంబంధించిన పనులను కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సంక్షేమ పనుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రోల్ మోడల్గా నిలిచిందన్నారు. ''గత 60 ఏళ్లలో ప్రారంభించని అభివృద్ధి పనులను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేళ్లలో పూర్తి చేసి.. నగర శివార్లలో తాగునీటి సరఫరా పథకానికి వందల కోట్లు వెచ్చిస్తోందని.. సేవలను మరింత మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. కేంద్రం నుంచి సహకారం లేదని.. హైదరాబాద్లో వరదల సమయంలో కూడా కేంద్రం నిధులు ఇవ్వలేదని.. గుజరాత్లో వరదల కోసం మాత్రం మోదీ రూ. 1000 కోట్లు ఇచ్చారని మంత్రి కేటీఆర్ అన్నారు.