ఆ స్కీమ్‌పై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పిన ఉద్యోగ సంఘాల నేతలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం ఆయన నివాసంలో ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు.

By -  Knakam Karthik
Published on : 24 Feb 2026 7:54 PM IST

Telangana, CM RevanthReddy, Telangana Employee Unions, Health Schemes, TGO, TNGO

ఆ స్కీమ్‌పై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పిన ఉద్యోగ సంఘాల నేతలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం ఆయన నివాసంలో ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'ప్రమాద బీమా' మరియు 'సమగ్ర ఆరోగ్య పథకాల' (Accident Insurance & Comprehensive Health Schemes) పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (TGO), టీఎన్జీఓ (TNGO), రెవెన్యూ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు.

ఉద్యోగుల దశాబ్దాల కాలపు డిమాండ్‌ను నెరవేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వారు 'చారిత్రాత్మకమైనది'గా అభివర్ణించారు. ముఖ్యంగా 652 ఎంప్యానెల్డ్ ఆసుపత్రులలో సుమారు 1,998 రకాల వ్యాధులకు నగదు రహిత చికిత్స (Cashless Treatment) అందించడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పథకం ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబాలకు అటు ఆర్థిక భరోసాను, ఇటు ఆరోగ్య రక్షణను కల్పిస్తుందని నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల జేఏసీ (JAC) నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story