రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం

రేపు (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో తెలంగాణ మంత్రి వర్గం సమావేశం జరగనుంది

By Knakam Karthik
Published on : 22 Jun 2025 9:15 PM IST

Telangana, CM Revanth Reddy, Secretariat,  Cabinet meeting, Godavari-Banakacharla, Local Body Elections

రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో తెలంగాణ మంత్రి వర్గం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్టు, మౌలిక వసతుల సదుపాయాలు, నిధుల సమీకరణపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

ఈ సమావేశం అనంతరం బనకచర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చర్చలకు ఆహ్వానించనుంది తెలంగాణ ప్రభుత్వం. విభజన చట్టంలోని పరిమితులకనుగణంగా బనకచర్ల అనుబంధ ప్రాజెక్టుగా ఉండటాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో స్పష్టతనిచ్చారు. ఆయన్ను ఉటంకిస్తూ “ఏపీతో చర్చలు అవసరం. వివాదాలకు కాదు, పరిష్కారాలకు మేము సిద్ధం” అని తెలిపారు.

మంత్రివర్గ భేటీలో మరో ముఖ్య అంశం స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చే కానుంది. జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ స్థాయిలో జరిగే ఎన్నికల షెడ్యూల్‌పై ప్రాథమిక చర్చ జరిగే అవకాశం ఉంది. తద్వారా స్థానిక పాలనను మరింత బలోపేతం చేయాలనే ప్రభుత్వ యోచన స్పష్టమవుతోంది.

Next Story