సుప్రీం కోర్ట్ తీర్పు శుభ పరిణామం: టీపీసీసీ చీఫ్

42 శాతం బిసి రిజర్వేషన్లు ఆపాలని సుప్రీంకోర్టులో వేసిన కేసును కోర్టు కొట్టి వేయడాన్ని స్వాగతిస్తున్నాం..అని టీపీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

By -  Knakam Karthik
Published on : 6 Oct 2025 3:50 PM IST

Telangana, BC Reservations,  TPCC chief Mahesh, Supreme Court, Congress

సుప్రీం కోర్ట్ తీర్పు శుభ పరిణామం: టీపీసీసీ చీఫ్

హైదరాబాద్: 42 శాతం బిసి రిజర్వేషన్లు ఆపాలని సుప్రీంకోర్టులో వేసిన కేసును కోర్టు కొట్టి వేయడాన్ని స్వాగతిస్తున్నాం..అని టీపీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అన్ని రకాలుగా పోరాటాలు చేసి సాధిస్తాం. ఇప్పటికే ప్రభుత్వం 3 చట్టాలు, ఒక ఆర్డినెన్స్ ఒక జీవో ఇచ్చి బిసి రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేసింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ లు బిసి రిజర్వేషన్లు అమలు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.. 8న హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నాము..బీసీలకు రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం అన్ని వర్గాలు ప్రభుత్వానికి సహకరించాలి..అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

Next Story