మెదక్ జిల్లాలోని హవేలీ ఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో దారుణం చోటు చేసుకుంది. రైతు బంధు డబ్బులు ఇవ్వలేదని తండ్రి నాలుకను కన్నకమారుడే కోసేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఔరంగాబాద్ తండాకు చెందిన బానోత్ కిర్యా అనే రైతుకు ఇద్దరు కుమారులున్నారు. ఇటీవల ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు జమయ్యాయి. కిర్యాకు రూ.9 వేలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చిన్న కుమారుడు సంతోశ్ ఆ డబ్బులివ్వాలని మంగళవారం తండ్రిని కోరాడు. ఆసుపత్రిలో వైద్యానికి రూ.5 వేలు ఖర్చు అయ్యాయని, రూ.4 వేలు తీసుకోవాలని చెప్పినప్పటికీ అతడు ఏ మాత్రం వినిపించుకోలేదు.
దీంతో ఆగ్రహానికి గురైన సంతోష్ తండ్రిపై దాడి చేయడమే కాకుండా కొడవలితో తండ్రి నాలుకను అతడు కోసేశాడు. తీవ్ర రక్తస్రావం అయిన అతడిని కుటుంబ సభ్యులు మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించగా నాలుకకు కుట్లు వేశారు. కీర్యా భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు.