SLBC Tunnel: గురుప్రీత్ సింగ్ కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం.. ప్రకటించిన సీఎం

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంలో పంజాబ్‌కు చెందిన మిషన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న గురుప్రీత్‌ సింగ్ మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర సంతాపం తెలియజేశారు.

By అంజి
Published on : 10 March 2025 7:55 AM IST

SLBC Tunnel, CM Revanth, compensation, Gurpreeth Singh family

SLBC Tunnel: గురుప్రీత్ సింగ్ కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం.. ప్రకటించిన సీఎం 

హైదరాబాద్‌: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంలో పంజాబ్‌కు చెందిన మిషన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న గురుప్రీత్‌ సింగ్ మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర సంతాపం తెలియజేశారు. నిన్న గురుప్రీత్ సింగ్‌ గారి మృతదేహం లభ్యమైంది. అతని మృతదేహం బురద, శిథిలాల కింద సుమారు 10 అడుగుల లోతులో ఉంది. రెస్క్యూ బృందాలు మొదట్లో తాము తవ్విన ప్రాంతంలో, సొరంగం లోపల బురదలో ఒక చేతిని చూసిన తర్వాత ఇది జరిగింది. కేరళ పోలీసులకు చెందిన మానవ అవశేషాలను గుర్తించే కుక్కలు మనుషుల ఉనికిని సూచించిన ప్రదేశాలలో ఇది ఒకటి.

గురుప్రీత్ సింగ్ మరణవార్త తెలిసి తీవ్ర సంతాపం తెలియజేసిన ముఖ్యమంత్రి.. వారి కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. అమెరికాకు చెందిన రాబిన్‌సన్ కంపెనీ ఉద్యోగిగా గురుప్రీత్ సింగ్ టన్నెల్‌లో బోరింగ్ మిషన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. గురుప్రీత్ సింగ్ మరణించారని తెలిసి ముఖ్యమంత్రి గారితో పాటు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీవ్ర సంతాపం, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. మృత దేహాన్ని పంజాబ్‌లోని వారి స్వగ్రామానికి తరలించారు.

Next Story