మాయ‌దారి మైస‌మ్మ‌, కోడిపాయె ల‌చ్చ‌మ్మ పాట‌ల‌ 'సింగ‌ర్' క‌న్నుమూత‌

Singer Lingaraju Passes Away. తెలుగు జ‌నాల‌ను ఉర్రూత‌ళూగించిన‌ మాయ‌దారి మైస‌మ్మ‌, కోడిపాయె ల‌చ్చ‌మ్మ వంటి జ‌నాప‌దాల‌ను

By Medi Samrat
Published on : 24 Dec 2020 10:41 AM IST

మాయ‌దారి మైస‌మ్మ‌, కోడిపాయె ల‌చ్చ‌మ్మ పాట‌ల‌ సింగ‌ర్ క‌న్నుమూత‌

తెలుగు జ‌నాల‌ను ఉర్రూత‌ళూగించిన‌ మాయ‌దారి మైస‌మ్మ‌, కోడిపాయె ల‌చ్చ‌మ్మ వంటి జ‌నాప‌దాల‌ను ఆల‌పించిన గాయ‌కుడు ఇక‌లేరు. ఫోక్ పాట‌ల‌తో యూత్‌లో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న‌‌ ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత‌, గాయ‌కుడు లింగ‌రాజ్( 66) బుధ‌వారం ఉద‌యం క‌న్నుమూశారు. సుమారు వెయ్యికి పైగా పాట‌లు పాటలు రాసి పాడిన లింగ‌రాజ్.. 1987లో పాడిన మాయ‌దారి మైస‌మ్మ పాట‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

పాట‌ల ర‌చ‌న‌తో పాటు గాత్రంతో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. బొల్లారం ఆదర్శనగర్‌లో ఉండే లింగరాజ్‌.. స్థానిక మిత్రులతో కలసి డిస్కో రికార్డింగ్‌ కంపెనీ (డీఆర్‌సీ) పేరిట ఓ సంస్థ‌ను ఏర్పాటు చేశారు. వారితో క‌లిసి ఎన్నో జాన‌ప‌ద గేయాలు, అయ్య‌ప్ప‌ భ‌జ‌న పాటలు పాడారు. లింగ‌రాజ్‌కు‌‌ భార్య , ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. లింగ‌రాజ్ మ‌ర‌ణం ప‌ట్ల ప‌లువురు క‌ళాకారులు సంతాపం వ్య‌క్తం చేశారు.


Next Story