ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు కరోనా పాజిటివ్
RS Praveen Kumar Tested For Covid Positive. మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్కు కరోనా పాజిటివ్గా
By Medi Samrat Published on 10 Aug 2021 10:59 AM GMT
మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. గత రెండు రోజులుగా నీరసంగా ఉంటే కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యాను. నాతో అతి దగ్గరగా తిరిగిన వ్యక్తులు ఐసోలేషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. నాకు చాలా స్వల్ప లక్షణాలున్నాయి.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'' అంటూ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.
గత రెండురోజులుగా నీరసంగా ఉంటే Covid టెస్టు చేయించుకుని, Positive గా నిర్దారణ అయిన వెంటనే ప్రభుత్వ గాంధీ హాస్పిటల్ కు వచ్చి చికిత్స చేయించుకుని ఇప్పుడే డిశ్చార్జి అయ్యాను. నాతో అతి దగ్గరగా తిరిగిన వ్యక్తులూ,Please isolate yourselves. I have mild symptoms. Nothing to worry at all. pic.twitter.com/mqYTfC8fmL
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) August 10, 2021
ఇదిలావుంటే.. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదివారం నల్లగొండ ఎన్జీ కాలేజీ మైదానంలో భారీ సభ నిర్వహించారు. రాజ్యాధికార సంకల్ప సభ పేరుతో జరిగిన సమావేశంలో బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్కుమార్ బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ)లో చేరారు.