వారు గౌర‌వాన్ని పెంచితే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జిల్లా పరువు తీస్తున్నారు : రేవంత్ రెడ్డి

Revanth Reddy Slams Nizamabad BRS MLAs. తెలంగాణ తల్లికి బంధ విముక్తి కలిగించేందుకే పాదయాత్ర చేస్తున్న‌ట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు.

By Medi Samrat  Published on  12 March 2023 8:41 AM GMT
వారు గౌర‌వాన్ని పెంచితే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జిల్లా పరువు తీస్తున్నారు : రేవంత్ రెడ్డి

Revanth Reddy


తెలంగాణ తల్లికి బంధ విముక్తి కలిగించేందుకే పాదయాత్ర చేస్తున్న‌ట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చారిత్రక లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఆయ‌న అనంత‌రం మాట్లాడుతూ.. స్వయంపాలనతో కూడిన సామాజిక తెలంగాణ కాంగ్రెస్ లక్ష్యం అన్నారు. నరసింహ స్వామి సాక్షిగా ప్రశ్నిస్తున్నా.. తెలంగాణ వచ్చినా ఇక్కడి రైతులను ప్రభుత్వం ఆదుకుందా? అని అడిగారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. కానీ తెలంగాణలో నిరుద్యోగుల జీవితాల్లో మార్పు రాలేదు. తెలంగాణ వచ్చినా ప్రజల కష్టాలు తీరలేదని అన్నారు.

పోరాటంలో, పట్టుదలలో, పౌరుషంలో నిజామాబాద్ రైతులు హర్యానా రైతులకు తక్కువేం కాదు. కేసీఆర్ కుడి భుజం అని చెప్పుకునే మంత్రి ప్రశాంత్ రెడ్డిని అడుగుతున్నా.. ఈ ప్రాంతంలో చెరుకు పరిశ్రమను ఎందుకు మూసివేశారు? ఎందుకు ఇక్కడి రైతులను ఆదుకోవడంలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం లేదా? చైతన్యం కలిగిన రైతులు ఒక్కసారి ఆలోచన చేయండి. సుదర్శన్ రెడ్డి, మండవ లాంటి గొప్ప నాయకులు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉండి ఈ ప్రాంతం గౌరవాన్ని పెంచారు. కానీ ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ జిల్లా పరువు తీస్తున్నారని విమ‌ర్శించారు. ఇక్కడ ఏ దోపిడీ చూసినా ప్రశాంత్ రెడ్డి, గణేష్, జీవన్ రెడ్డి పేర్లే వినిపిస్తున్నాయని ఆరోపించారు. ఇసుక దోపిడీ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని విమ‌ర్శించారు.


Next Story