రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ ద‌క్క‌దు

Rajgopal Reddy will lose deposit. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డిపాజిట్‌ కోల్పోతారని

By Medi Samrat  Published on  8 Oct 2022 12:52 PM GMT
రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ ద‌క్క‌దు

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డిపాజిట్‌ కోల్పోతారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శనివారం అన్నారు. శనివారం చౌటుప్పల్‌ మండలం దామెర, నాగారం, చింతలగూడెం గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి.. రాజగోపాల్‌రెడ్డికి ఓటమి తప్పదని, డిపాజిట్‌ దక్కద‌ని ప్రజల మనోభావాలు తెలియజేస్తున్నాయన్నారు. వ్యాపార ప్రయోజనాల కోసం రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడం వల్లే ఉప ఎన్నిక వచ్చిందని గుర్తుంచుకోవాలన్న‌ మంత్రి.. ఉప ఎన్నిక వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు దేశవ్యాప్తంగా ఆదరణ పెరిగిందని, తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఆయన నాయకత్వం కోసం చూస్తున్నారని.. ఆ కార‌ణంగానే బీజేపీ నేతల్లో భయాందోళనలు నెలకొన్నాయ‌ని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. చంద్రశేఖర్‌రావును తెలంగాణకే పరిమితం చేయాలనే కుట్రలో భాగంగానే మునుగోడు ఉప ఎన్నికకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా సహా బీజేపీ నేతలు కుట్ర పన్నారన్నారు. జార్ఖండ్‌లోని తన కంపెనీకి రూ.22,000 కోట్ల బొగ్గు మైనింగ్ కాంట్రాక్టును ఇప్పిస్తానని రాజ్‌గోపాల్ రెడ్డిని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని ప్రలోభపెట్టారని అన్నారు.


Next Story