సీఎం రేవంత్‌ నిజమైన గో సంరక్షుడు: ఎమ్మెల్యే రాజాసింగ్‌

రాష్ట్రంలో మోడ్రన్‌ గోశాలలు నిర్మించాలన్న సీఎం రేవంత్‌ నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ హర్షం వ్యక్తం చేశారు.

By అంజి
Published on : 18 Jun 2025 12:02 PM IST

BJP MLARaja Singh, CM Revanth Reddy, True CM for Cow Protection, Telangana

సీఎం రేవంత్‌ నిజమైన గో సంరక్షుడు: ఎమ్మెల్యే రాజాసింగ్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో మోడ్రన్‌ గోశాలలు నిర్మించాలన్న సీఎం రేవంత్‌ నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గోవుల రక్షణ కోసం ఒక స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అందులో తనని కూడా సభ్యుడిగా చేర్చాలని కోరారు. దేశంలోని సీఎంలలో నిజమైన గో రక్షకులంటే మొదట యోగి, ఆ తర్వాత సీఎం రేవంత్‌ పేరే చెప్తారన్నారు.

ఇటువంటి కార్యక్రమాలు తెలంగాణ నాయకత్వానికి జాతీయ గుర్తింపును తెచ్చిపెడతాయని అన్నారు. గోసంరక్షణపై తన స్వర వాదానికి పేరుగాంచిన రాజా సింగ్, వివిధ కబేళాలలో ఆవులు, దూడలు మరియు ఎద్దులను అక్రమంగా వధిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో గోవధను పూర్తిగా నిషేధించాలనే తన దీర్ఘకాల డిమాండ్‌ను ఆయన పునరుద్ఘాటించారు .

రాష్ట్రంలో గో సంరక్షణ కోసం ఎంత ఖర్చు చేసేందుకూనా వెనుకాడబోమని సీఎం రేవంత్‌ అన్నారు. ఇందుకోసం సమగ్ర గో సంరక్షణ విధానం రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. నిన్న జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో గో సంరక్షణపై మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి సీఎం రేవంత్‌ సమీక్ష నిర్వహించారు. వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్‌లో రెండు చోట్ల గోశాలలు నిర్మించాలని, భక్తులు అందించే కోడెలపై శ్రద్ధ చూపాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Next Story