హైదరాబాద్ కు చేరుకున్న రాహుల్‌, ప్రియాంక

తెలంగాణలో మూడు రోజుల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా హైదరాబాద్ కు చేరుకున్నారు.

By Medi Samrat  Published on  18 Oct 2023 11:07 AM GMT
హైదరాబాద్ కు చేరుకున్న రాహుల్‌, ప్రియాంక

తెలంగాణలో మూడు రోజుల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయం చేరుకున్న రాహుల్, ప్రియాంక గాంధీలు నేరుగా ములుగు జిల్లా రామప్ప గుడికి వెళ్లనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకుల పూజలు నిర్వహించనున్నారు. బస్సు యాత్రగా బయలుదేరి వెంకటాపూర్ మండలం రామాంజపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడే మహిళా డిక్లరేషన్ ప్రకటించనున్నారు ప్రియాంక. వీరి పర్యటన నేపథ్యంలో రామప్ప ఆలయాన్ని భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో హై అలెర్ట్ ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి జోష్ తెప్పించడానికి రాహుల్, ప్రియాంక లు తెలంగాణకు వచ్చారు. తెలంగాణలో మూడు రోజులపాటు కాంగ్రెస్ నేతలు బస్సుయాత్ర చేయనున్నారు. 3 రోజుల్లో 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రల్లో రాహుల్, ప్రియాంక పాల్గొననున్నారు. అక్టోబర్ 19న రామగుండం, పెద్దపల్లి, కరీంనగర్ లో యాత్ర సాగనుంది. 20న నిజామాబాద్ జిల్లాలో రాహుల్ బస్సుయాత్ర చేపట్టనున్నారు. ఆర్మూర్ లో పసుపు రైతులతో భేటీ కానున్నారు రాహుల్ గాంధీ.

Next Story