మేడారం జాతరలో విషాదం.. గుండెపోటుతో హెడ్కానిస్టేబుల్ మృతి
Policeman dies of heart stroke at Medaram jatara. మంగళవారం ఉదయం ములుగు జిల్లా మేడారం సమ్మక్క-సారక్క జాతరలో విషాద ఘటన చోటు చేసుకుంది.
By అంజి Published on
15 Feb 2022 10:52 AM GMT

మంగళవారం ఉదయం ములుగు జిల్లా పరిధిలో రెండేళ్ల కొకసారి నిర్వహించే మేడారం సమ్మక్క-సారక్క జాతరలో విషాద ఘటన చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ బి రమేష్ వడదెబ్బతో మృతి చెందాడు. మేడారం జాతర బందోబస్తులో భాగంగా గంబీరావుపేట పోలీసులతో రమేష్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రధాన జాతర స్థలం నిష్క్రమణ ద్వారం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఆయన ఉదయం గుండెపోటుకు గురై కుప్పకూలారు. అనంతరం కానిస్టేబుల్ రమేష్ అక్కడికక్కడే మృతి చెందారు.
హెడ్ కానిస్టేబుల్ మృతి పట్ల మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు, సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్, సిఐ మొగిలి, ఘంబీరావుపేట ఎస్ఐ మహేష్లు ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని డీఎస్పీ, సీఐ హామీ ఇచ్చారు. కరీంనగర్కు చెందిన తీగలగుట్టపల్లికి చెందిన రమేష్ ఇటీవల బదిలీల్లో ఘంబీరావుపేట పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు. కానిస్టేబుల్ రమేష్ మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story