హైదరాబాద్లో బస్ పాస్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెలంగాణ జాగృతి నేతలు బస్భవన్ను ముట్టడికి ప్రయత్నించారు. కాగా ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ జాగృతి కూడా భారీ ఎత్తున తరలిరావడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలోనే భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీంతో బస్ భవన్ వద్ద నిరసన తెలిపిన ఎమ్మెల్సీ కవితను పోలీసులు అరెస్ట్ చేసి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. వెంటనే ఆర్టీసీ పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బస్పాస్ ధరలను పెంచి ప్రజలపై ప్రభుత్వం పెనుభారాన్ని మోపిందని మండిపడ్డారు. విద్యార్థులు, చిరుద్యోగులపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతుందని, బస్పాస్ ధరలను పెంచి ప్రజలపై గుదిబండను మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పెంపుతో ఒక్క ప్రయాణికుడిపై నెలకు దాదాపు రూ. 300 పైగా భారం పడుతుందని అంచనా వేశారు. మరోవైపు అనేక రూట్లలో విద్యార్థుల కోసం బస్సులు నడపడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటు పడింది..అని ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు.