టైఫాయిడ్‌కు పానీ పూరి తిన‌డం కార‌ణ‌మా.. వైద్యులు ఏమంటున్నారు..

Pani Puri is only partially to blame for typhoid, say city's physicians. నగరంలో టైఫాయిడ్ కేసులు పెరగడానికి కోల్డ్ ఫుడ్స్, ఫిల్టర్ చేయని నీరు

By Medi Samrat  Published on  12 July 2022 3:23 PM GMT
టైఫాయిడ్‌కు పానీ పూరి తిన‌డం కార‌ణ‌మా.. వైద్యులు ఏమంటున్నారు..

నగరంలో టైఫాయిడ్ కేసులు పెరగడానికి కోల్డ్ ఫుడ్స్, ఫిల్టర్ చేయని నీరు కార‌ణ‌మ‌ని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు మంగళవారం మాట్లాడుతూ.. నగరంలో టైఫాయిడ్ కేసులు పెరగడానికి పానీపూరీ కారణమని అన్నారు. అయితే ఇది పాక్షిక కారణం మాత్ర‌మే అని వైద్యులు చెబుతున్నారు. నీరు, ఆహారం కలుషితం కావడం, సరిగ్గా వేడి చేయని ఆహారాల వల్ల టైఫాయిడ్ వస్తుంది అని వారు అంటున్నారు.

మంగళవారం నాటి ప్రెస్ మీట్ లో డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ముఖ్యంగా టైఫాయిడ్ కేసులన్నీ పానీపూరీ కేసులే.. దీన్ని పానీపూరీ వ్యాధి అని కూడా అనవచ్చు.. రుచి కోసం తింటారు కానీ ఎంత హానికరమో అర్థం కావడం లేదని అన్నారు. ఈ సీజన్‌లో విక్రయదారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. "వారు నీటిని ఉపయోగించే ముందు నీటిని మరిగించాలి. పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఆహారం దగ్గర దోమలు, ఈగలు వృద్ధి చెందకుండా చూసుకోవాలి," అన్నారాయన.

ఈ విష‌య‌మై కేర్ హాస్పిటల్స్‌ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాహుల్ అగర్వాల్ వివరిస్తూ.. "పానీ పూరీలో నీటి మిశ్రమాలు ఉన్నాయి. ఉపయోగిస్తున్న‌ నీటి మూలాలు తెలియదు కాబట్టి అవి కలుషితమవుతాయని అంటున్నారు. అదేవిధంగా చల్లగా ఉండే ఆహార పదార్థాలు కూడా కలుషితానికి కారణమని అనుమానిస్తున్నారు.

డాక్టర్ జె సతీష్, జనరల్ ఫిజిషియన్ వివరిస్తూ, "చేతులు, ఇంటి ఈగల ద్వారా కలుషితం అవుతుంది. ఈ రెండు ఏజెంట్లు వ్యాధుల ఆవిర్భావానికి సాధనాల‌ని అన్నారు.

ఇప్ప‌టికే కొన్ని రోజులుగా కోవిడ్ 19 కేసులు న‌మోద‌వుతుండ‌గా.. వాతావ‌ర‌ణ మార్పుల‌తో డెంగ్యూ, టైపాయిడ్ కేసులు కూడా ఏర్ప‌డ‌టం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నీటి ఎద్దడి ఏర్పడిందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల నివారణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని వైద్యులు పేర్కొంటున్నా రు.



















Next Story